నిజంనిప్పులాంటిది

Apr 24 2024, 08:40

నేటి నుండి కొనసాగనున్న మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్ర
బీఆర్‌ఎస్‌ అధినేత, తెలం గాణ తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రాష్ట్రవ్యా ప్తంగా చేపట్టే బస్సు యాత్ర బుధవారం ప్రారంభం కాను న్నది. ఈ నేప‌థ్యంలో కేసీఆర్ యాత్ర కొన‌సాగించ‌బోయే బ‌స్సుకు తెలంగాణ భ‌వ‌న్‌ లో మంగ‌ళ‌వారం ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు.

ఈ పూజా కార్య‌క్ర‌మాల్లో గులా బీ శ్రేణులు పాల్గొన్నారు. నేటినుండి వరుసగా 17 రోజుల పాటు సాగే ఈ యాత్రకు ఎన్నికల కమిషన్‌ అనుమతి ఇవ్వడంతో పార్టీ అవసరమైన ఏర్పాట్లను చేస్తున్నది.

మే నెల 10 వరకు ఈ బస్సు యాత్ర కొనసాగుతుంది. మిర్యాలగూడలో ప్రారంభ మై సిద్దిపేటలో జరిగే బహి రంగసభతో ఈ యాత్ర ముగుస్తుంది. లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కేసీఆర్‌ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు.

దాదాపు ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఒకటి రెండు అసెంబ్లీ నియోజక వర్గాల్లో రోడ్‌షోలు ఉండే విధంగా బస్సు యాత్రను ప్లాన్‌ చేశారు.

తమ నియోజకవర్గాల్లో కూడా కేసీఆర్‌ బస్సు యాత్ర చేయాలంటూ వివిధ నియో జకవర్గాల నేతల నుంచి డిమాండ్‌ వస్తున్నది. అయి తే, సమయం తక్కువగా ఉండటం, ఎండ వేడి దృష్ట్యా కొన్ని నియోజక వర్గాల్లోనే బస్సు యాత్ర చేపట్టాలని నిర్ణయించారు...

నిజంనిప్పులాంటిది

Apr 24 2024, 08:37

CSK 211 టార్గెట్ ను ఛేదించిన లక్నో

చెన్నై చిదంబరం స్టేడియం వేదిక‌గాలో సీఎస్‌కే తో తలపడిన లక్నో సూపర్ జెయింట్స్ ఘన విజయం సాధించింది. చెపాక్‌లో భారీ ఛేద‌న‌కు దిగిన ల‌క్నో.. చెన్నైపై లక్నో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.

సీఎస్‌కే నిర్దేశించిన 211 పరుగుల ఛేదనలో లక్నో జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు క్వింటన్ డి కాక్ (0), కేఎల్ రాహుల్ (16) వెనుదిరిగారు.

ఈ క్రమంలో మార్కస్ స్టోయినిస్ సెంచరీతో విజృంభించాడు.63 బంతుల్లో 124 పరుగుల నాటౌట్ తో చెలరేగిపోయా డు. మరోవైపు నికోలస్ పూరన్,15 బంతుల్లో 34 పరుగులు, దీపక్ హుడా 6 బంతుల్లో 17 పరుగులు నాటౌట్, స్టోయినిస్‌కు మంచి స‌పోర్ట్‌గా నిలిచారు.

దీంతో చెన్నై జట్టు నిర్దేశిం చిన 211 పరుగుల లక్ష్యా న్ని 3 బంతులు మిగిలి ఉండగానే నాలుగు వికెట్లు కోల్పోయి.. 6 వికెట్లతో గెలుపొందింది లక్నో. ఇక ఈ విజయంతో పాయింట్స్ టేబుల్‌లో 5వ స్థానంలో ఉన్న లక్నో 4వ స్థానానికి చేరుకుంది..

నిజంనిప్పులాంటిది

Apr 22 2024, 10:45

Madhavi Latha: హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదు

*•శ్రీరామనవమి ఊరేగింపులో మసీదు వైపు బాణం వదులుతున్నట్టు ఊహాజనిత సంకేతమిచ్చిన బీజేపీ అభ్యర్థి*

*•ముస్లింల మనోభావాలు దెబ్బతీశారంటూ షేక్ ఇమ్రాన్ అనే వ్యక్తి ఫిర్యాదు*

*•బేగంబజార్‌ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు*

మతపరమైన మనోభావాలను దెబ్బతీశారనే ఫిర్యాదుపై హైదరాబాద్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదయింది. సిటీలోని ఫస్ట్ లాన్సర్ ప్రాంతానికి చెందిన షేక్ ఇమ్రాన్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బేగంబజార్ పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు నమోదయింది. ఏప్రిల్ 17న శ్రీరామనవమి శోభాయాత్రలో పాల్గొన్న మాధవి.. సిద్ది అంబర్ బజార్ సర్కిల్ వద్ద ఉన్న మసీదు వైపు బాణం గురిపెట్టి వదులుతున్నట్టు ఊహాజనిత సంజ్ఞ చేశారని ఇమ్రాన్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

ఆమె బాధ్యతారహిత చర్యకు పాల్పడ్డారని, ముస్లిం సమాజం మనోభావాలను దెబ్బతీశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బీజేపీ అభ్యర్థిగా మాధవీ లతను ప్రకటించిన నాటి నుంచి ఆమె ముస్లిం సమాజంపై కించపరిచే వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారని ఆరోపించారు. దీంతో ఐపీసీలోని 295-ఏ (మతం లేదా మత విశ్వాసాలను అవమానించడం), ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 125 ( ఉద్దేశపూర్వకంగా మతవిశ్వాసాలను రెచ్చగొట్టడం), హానికరమైన చర్యలకు పాల్పడటం వంటి సెక్షన్ల కింద పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.

కాగా మసీదు వైపు బాణం వేస్తున్నట్టుగా మాధవీ లత ఇచ్చిన ఊహాజనిత సంజ్ఞకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఎన్నికల సంఘం మౌనంగా ఉందంటూ ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తప్పుబట్టారు. ఈ విమర్శలపై మాధవీ లత స్పందిస్తూ.. వీడియో అసంపూర్తిగా ఉందన్నారు. వీడియో కారణంగా ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమాపణలు కోరుతున్నానని కూడా ఆమె అన్నారు. సోషల్ మీడియా హ్యాండిల్ ఎక్స్‌లో కూడా ప్రతిపక్షాలపై దాడి చేశారు. ప్రత్యర్థి పార్టీల పరువు తీయవద్దని, వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టవద్దని మాధవి లత ఘాటుగా వ్యాఖ్యానించారు.

*హైదరాబాద్‌లో మే 13న పోలింగ్*

దేశంలో లోక్‌సభ ఎన్నికలు ప్రారంభమయ్యాయి, ఏప్రిల్ 19న 21 రాష్ట్రాల్లోని 102 స్థానాలకు పోలింగ్ జరిగింది. అయితే మే 13న హైదరాబాద్‌లో ఓటింగ్ జరగాల్సి ఉంది. 2004 నుండి అసదుద్దీన్ ఒవైసీ మరియు 1989 నుండి అతని తండ్రి సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ హైదరాబాద్ స్థానం నుండి మాధవి లత పార్టీ అభ్యర్థిగా ఉన్నారు.

నిజంనిప్పులాంటిది

Apr 20 2024, 07:46

చెన్నై ని చిత్తు చేసిన లక్నో

ఐపీఎల్ 2024లో భాగంగా హోం గ్రౌండ్‌లో నిన్న చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్ విజయం సాధించింది.

చెన్నై నిర్దేశించిన 177 పరుగుల ఛేదనలో లక్నో ఓపెనర్లు చెలరేగిపోయారు. దీంతో సీఎస్‌కేపై జట్టు 8 వికెట్ల తేడాతో గెలుపొం దింది.

సొంత గడ్డ పై CSK ను త‌క్కువ‌కే క‌ట్ట‌డి చేసిన ల‌క్నోకు ఓపెన‌ర్లు శుభా రంభ‌మిచ్చారు. క్వింట‌న్ డికాక్‌(54), కెప్టెన్ కేఎల్ రాహుల్(82) చ‌రో హాఫ్ సెంచ‌రీతో చెన్నై బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డుతున్నారు.

ఇక ఆ త‌రువాత వ‌చ్చిన నికోలస్ పూరన్ 23,నాటౌట్ మెప్పించాడు. దాంతో 19 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసిన లక్నో… 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఇక చెన్నై బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహమాన్, మతీషా పతిరనా చెరో వికెట్ దక్కించుకున్నారు.

నిజంనిప్పులాంటిది

Apr 20 2024, 07:45

ఎగ్జిట్ పోల్ జూన్ 1 వరకు రద్దు?

దేశంలో సార్వత్రిక ఎన్నికలు నిన్ను ప్రారంభం అయ్యా యి. ఈసారి లోక్ సభ ఎన్నికలతో పాటు ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహి స్తున్నారు.

మొత్తం 7 దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. అదే సమయంలో 12 రాష్ట్రాల్లో 25 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి.

నిన్ను దేశంలో తొలి దశ పోలింగ్ జరిగింది.ఈ తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం నేడు ఓ నోటిఫికేషన్ జారీ చేసింది.

దేశంలో ఎన్నికలు జరుగు తున్నందున ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం విధిస్తున్నట్టు తెలిపింది. ఏప్రిల్ 19వ తేదీ ఉదయం 7 గంటల నుంచి జూన్ 1వ తేదీ సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించరాదని ఈసీ స్పష్టం చేసింది.

ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఏ ఎలక్ట్రానిక్ మీడియాలోనూ ఎన్నికల ఫలితాలు, సర్వేలు, ఒపీని యన్ పోల్స్ ప్రదర్శించరా దని ఈసీ పేర్కొంది.

నిజంనిప్పులాంటిది

Apr 19 2024, 07:54

విధుల్లో నిర్లక్ష్యం ఆరుగురు పోలీసు అధికారులపై సస్పెన్షన్‌

హైదరాబాద్ మల్టీజోన్‌ -1 పరిధిలో విధుల్లో అలసత్వం వహించిన ఆరుగురు పోలీసు అధికారులను ఐజీ ఏవీ రంగనాథ్‌ గురువారం సాయంత్రం సస్పెండ్‌ చేశారు.

సస్పెండ్‌ అయిన వారిలో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు, ఇద్దరు ఎస్సైలు, హెడ్‌ కానిస్టేబుల్‌, కానిస్టేబుల్‌ ఉన్నారు. పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్ పరిధిలోని ప్రజా భవన్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదానికి కారణమైన

బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు రాహిల్‌ను తప్పించేందుకే పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్‌తో సంప్రదింపులు జరిపినట్టుగా హైదరాబాద్‌ సీపీ విచారణలో తేలడంతో అప్పటి బోధన్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రేమ్‌ కుమార్‌ను సస్పెండ్‌ చేశారు.

మద్యం సేవించి పోలీస్‌స్టే షన్‌కు వచ్చి స్టేషన్‌ సిబ్బం దిని ఇబ్బందులకుగురి చేసిన నిజామాబాద్‌ జిల్లా సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం.రమేశ్‌ను సస్పెండ్‌ చేశారు.

జగిత్యాల జిల్లా సారంగా పూర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన గంజాయి కేసులో అలసత్వంగా వ్యవహారిం చిన ఎస్సైలు మనోహర్ రావు, తిరుపతి, హెడ్ కానిస్టేబుల్ బి. రవీందర్ రెడ్డి, కానిస్టేబుల్ టి.నరేం దర్ లను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్- 1 ఐజీ రంగ నాథ్‌ ఉత్తర్వులు జారీ చేశారు...

నిజంనిప్పులాంటిది

Apr 19 2024, 07:52

ముంబై ముందు తలవంచిన పంజాబ్

ఐపీఎల్ 2024లో భాగంగా నేడు జరిగిన ఉత్కంఠ పోరులో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది.

ముల్లన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 పరుగుల తేడాతో గెలుపొందింది. 193 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ జట్టు చివరి ఓవర్ వరకు పోరాడింది.

ఇక 19.1 ఓవర్లలో 183 పరుగులకు ఆలౌటైంది. ఇక ఈ విజయంతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉన్న ముంబై 7వ స్థానానికి చేరుకుంది.

అయితే, పంజాబ్ కింగ్స్ టాపార్డర్ పూర్తిగా విఫల మైనప్పటికీ… మిడిలార్డర్ బ్యాటర్లు శ‌శాంక్ సింగ్, అశుతోష్ శర్మ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు.

అశుతోష్ శర్మ (61; 28 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్స‌ర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. శ‌శాంక్ సింగ్ (41; 25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) రాణించాడు. హర్‌ప్రీత్ బ్రార్ (21) పరువాలేదరనిపించాడు.

ఇక ముంబై బౌల‌ర్ల‌లో బుమ్రా, గెరాల్డ్ కోయెట్జీ చెరో మూడు వికెట్లు పడగొట్ట గా… శ్రేయాస్ గోపాల్, ఆకాశ్ మ‌ధ్వాల్, హార్దిక్ పాండ్యలు త‌లా ఓ వికెట్ దక్కించుకున్నారు.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియ‌న్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్లు నష్టానికి 192 ప‌రుగులు చేసింది. ముంబై బ్యాట‌ర్ల‌లో సూర్యకుమార్ యాదవ్ (78; 53 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీ చేయ‌గా..

తిల‌క్ వ‌ర్మ (34 నాటౌట్; 18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), రోహిత్ శ‌ర్మ (36; 25 బంతుల్లో 2ఫోర్లు, 3సిక్స‌ర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు.

పంజాబ్ కింగ్స్ బౌలర్లలో హర్షల్ పటేల్ మూడు వికెట్లు తీశాడు. సామ్ కరణ్ రెండు వికెట్లు తీయగా కగిసో రబడా ఓ వికెట్ పడగొట్టాడు...

నిజంనిప్పులాంటిది

Apr 19 2024, 07:50

ఏసీబీకి చిక్కిన టౌన్‌ ప్లానింగ్‌ సూపర్‌వైజర్ వెంకటరమణి

ఓ భూమిని ఎల్‌ఆర్‌ఎస్‌ చేయడం కోసం టీపీఎస్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.

ఈ ఘటన భద్రాద్రి కొత్త గూడెం జిల్లా పాల్వంచ మున్సిపల్‌ కార్యాలయంలో గురువారం చోటు చేసుకుం ది. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

పాల్వంచ మున్సిపల్‌ కార్యా లయంలో టౌన్‌ ప్లానింగ్‌ సూపర్‌వైజర్‌ టీపీఎస్‌ గాపని చేస్తున్న వెంకటర మణి, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి ప్రసన్నకుమార్‌ ఓ భూమి విషయంలో ఎల్‌ఆర్‌ ఎస్‌ చేయడం కోసం ప్లాట్‌కు రూ.10 వేల చొప్పున మూడు ప్లాట్లకు రూ.30 వేలు డిమాండ్‌ చేశారు.

తాను రూ.30 వేలు ఇవ్వలేనని, ప్లాట్‌కు రూ.5 వేల చొప్పున.. రూ.15 వేలు ఇస్తామని పాల్వంచకు చెందిన భూ యజమాని కాంపెల్లి కనకేష్‌ సదరు ఉద్యోగులతో ఒప్పందం కుదుర్చుకున్నాడు.

తర్వాత ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు వివరించిన కనకేష్‌.. వారి సూచన మేరకు గురువారం టీపీఎస్‌కు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగికి రూ.15 వేలు లంచం ఇస్తుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ఏసీబీ డీఎస్పీ రమేశ్‌ వెల్లడించారు.

ఎవరైనా లంచం అడిగితే 1064 టోల్‌ ఫ్రీ నంబర్‌కు కాల్‌ చేసి ఫిర్యాదు చేయొ చ్చన్నారు. ఈ విషయంలో ఎవరూ భయపడవద్దని, ఫిర్యాదుదారులకు అండగా ఉంటామని ఆయన పేర్కొన్నారు...

నిజంనిప్పులాంటిది

Apr 18 2024, 09:04

నేడు భద్రాద్రిలో శ్రీరాముని పట్టాభిషేక మహోత్సవం

భద్రాద్రి లో శ్రీరామనవమి శోభ సంతరించుకుంది. భద్రాచల పుణ్యక్షేత్రంలో బుధవారం శ్రీసీతారాముల కళ్యాణోత్సవం కన్నుల పండువగా జరిగింది. గురువారం శ్రీ రామ మహా పట్టాభిషేక మహోత్సవం జరగనుంది.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవ ర్నర్ రాధాకృష్ణన్ దంపతు లు హాజరు కానున్నారు. మిథిలా కళ్యాణ మండ పంలో ఈరోజు ఉదయం 10.30 గంటల నుంచి 12.30 వరకు పట్టాభిషేక మహోత్సవం జరగనుంది.

కాగా బుధవారం శ్రీసీతారా ముల కళ్యాణోత్సవం కన్ను ల పండువగా జరిగింది. కల్యాణ వేదికపై వధూవ రులుగా జానకిరాములు ఆసీనులయ్యారు. వరుడి తండ్రి దశరథ మహారాజు తరఫున ఒకటి, వధువు తండ్రి జనక మహారాజు తరఫున ఇంకోటి.. భక్తుల తరఫున మరొకటి.. ఇలా రామదాసు చేయించిన ‘‘మూడు సూత్రాల మంగళ సూత్రం’’ వేదమంత్రోచ్ఛా రణల నడుమ సీతమ్మవారి మెడలో పడింది.

అణిముత్యములు తలం బ్రాలయ్యాయి. ఆ తలంబ్రా లు నీలమేఘశ్యాముడైన రాముడు తన దోసిట తీసుకోగానే నీలపురాశిగా మిలమిలలాడాయి! సీతమ్మ దోసిట్లోకి చేరగానే కెంపులై మెరిశాయి! జానకిరాముల శిరమున వెలసిన ఆ తలబంబ్రాల దెంత భాగ్యం.. ఆ జగత్క ల్యాణ ఘట్టాన్ని కనులారా వీక్షించిన భక్తకోటిదెంత పుణ్యం! ఆ భక్తి భావన మనసునిండా ఉప్పొంగగా భక్తజనమంతా అంతా జై శ్రీరామ్‌ అంటూ నినాదాలు చేశారు.

ఇలా బుధవారం శ్రీరామ నవమి సందర్భంగా భద్రా చలం క్షేత్రంలో సీతారాముల కల్యాణం నేత్రపర్వంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరుపున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పిం చారు.

సర్కారు తరఫున పట్టువ స్త్రాలు, ముత్యాల తలం బ్రాలను సమర్పించిన తొలి సీఎస్‌ శాంతికుమారి కావ డం గమనార్హం. గురువారం రాముచంద్రమూర్తికి మహాప ట్టాభిషేకం నిర్వహించను న్నారు. మిథిలా స్టేడియం లోనే జరిగే ఈ కార్యక్రమం సందర్భంగా స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున గవర్నర్‌ రాధాకృష్ణన్‌ పట్టువస్త్రాలను సమర్పిం చనున్నారు..

నిజంనిప్పులాంటిది

Apr 18 2024, 07:21

చిత్తుగా చిత్తుగా ఓడిన గుజరాత్‌

నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్‌ను ఢిల్లీ మట్టికరి పించింది. ముందుగా బౌలిం గ్‌ ధాటితో కుప్పకూల్చిన ఢిల్లీ.. ఆ తర్వాత అవలీ లగా టార్గెట్‌ను చేధించింది. 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌కు ఆరంభం నుంచే ఢిల్లీ షాకులు ఇస్తూ వచ్చింది. ఢిల్లీ బౌలర్ల ధాటికి గుజరాత్‌ బ్యాటర్లు చతికి లబడ్డారు. ఎవ్వరూ కూడా చెప్పుకోదగ్గ పరుగులు చేయలేకపోయారు.

ఒక్క రషీద్‌ ఖాన్‌ (31) మాత్రమే జట్టుకు గౌరవ ప్రదమైన స్కోర్‌ అందించా డు. కానీ అప్పటికే జట్టు మొత్తం విఫలం కావడంతో 89 పరుగుల వద్దనే గుజ రాత్‌ ఆగిపోయింది. దీంతో 90 పరుగుల అత్యల్ప టార్గెట్‌తో బరిలోకి దిగిన ఢిల్లీ బ్యాటర్లు మధ్యలో తడబడినప్పటికీ 8.5 ఓవర్లలోనే అవలీలగానే టార్గెట్‌ను చేధించారు.

గుజరాత్‌ ఇన్నింగ్స్‌లో రెండో ఓవర్‌లోనే ఓపెనర్‌ శుభ్‌ మన్‌ గిల్‌ (8) ఔటవ్వగా.. నాలుగో ఓవర్‌లో ఐదో బంతికి మరో ఓపెనర్‌ వృద్ధిమాన్‌ సాహా (2) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. ఐదో ఓవర్‌లో మొదటి బంతికి సాయి సుదర్శన్‌ (12) రనౌటయ్యాడు.

ఆ తర్వాత వచ్చిన డేవిడ్‌ మిల్డర్‌ (2) కూడా రిషబ్‌ పంత్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. తొమ్మిదో ఓవర్‌లో అభినవ్‌ మనోహర్‌ (8), షారుక్‌ ఖాన్ (0)ను రిషబ్‌ పంత్‌ స్టంపౌట్‌ చేశాడు. 12వ ఓవర్‌లో రెండో బంతికి రాహుల్‌ తెవాటియా (10) ఎల్బీడ బ్ల్యూగా వెనుది రిగాడు.

15వ ఓవర్‌లో చివరి బంతికి మోహిత్‌ శర్మ (2).. సుమిత్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. 18వ ఓవర్‌లో మొదటి బంతికే రషీద్‌ ఖాన్ (31) పంత్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన నూర్‌ అహ్మద్‌, స్పెన్సర్‌ జాన్సన్‌ వెంటవెంటనే పెవిలియన్‌కు చేరారు. ఫలితంగా 17.3 ఓవర్ల వద్ద 89 పరుగులకే గుజరాత్‌ ఆలౌట్‌ అయ్యింది.

అత్యల్ప టార్గెట్‌ను చేధిం చేందుకు క్రీజులోకి ముందు గా వచ్చిన జెక్‌ ఫ్రేజర్‌ (20) దూకుడుగా ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టాడు. అతనికి పృథ్వీ షా ( 7) తోడయ్యా డు. కానీ జెక్‌ ఫ్రేజర్‌ దూకు డుకు స్పెన్సర్‌ జాన్సన్‌ చెక్‌ పెట్టాడు. ఫ్రేజర్‌ ఔటయిన కాసేపటికే పృథ్వీ షా కూడా పెవిలియన్‌కు పంపించారు.

ఆ తర్వాత కాసేపటికే గుజరాత్‌ బౌలర్లు అభిషేక్‌ పొరెల్‌ (15 ), షై హోప్‌ (19) వికెట్లను తీసి ఢిల్లీని టెన్షన్‌ పెట్టాలని అనుకున్నారు. కానీ రిషబ్‌ పంత్‌(16), సుమిత్‌ కుమార్‌ (9) నిలకడగా ఆడుతూ టార్గెట్‌ను చేధించారు...